చంద్రంపాలెం జాతర గట్టు దుర్గాలమ్మ ఆలయంలో విశేష పూజలు, మజ్జిగ పంపిణీ. ప్రసాద వితరణ.
May 09, 2025
చంద్రంపాలెం జాతర గట్టు శ్రీదుర్గాలమ్మ ఆలయంలో విశేష పూజలు.
ఆలయ ప్రాంగణంలో ఉన్న చలివేంద్రంలో చల్లని మజ్జిగ పంపిణీ!
విశాఖ సిటీ, (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శీను
మధురవాడ సెల్ నెంబర్ 950281 7542) చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్ల పక్షం ద్వాదశి శుక్రవారం సందర్భంగా ఉదయం నిత్య అర్చనలతో ప్రారంభమై కుంకుమార్చన పుష్పార్చన తదితర పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు పట్నాల మూర్తి శర్మ, హరి స్వామి తదితరులు నిర్వహించి కర్పూర హారతి నీరాజన మంత్ర పుష్పం సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు, సాయంత్రం వేళలో అమ్మవారికి పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించి కుంకుమార్చనలు పుష్పార్చనలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి కర్పూర హారతి సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు,
అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ఆలయ ప్రాంగణంలో దీపారాధన సేవా కార్యక్రమాలు నిర్వహించారు,
ఈ సందర్భంగా సాయి ప్రియా గార్డెన్ వాస్తవ్యులు శ్రీ సంతోష్ కుమార్, ఉదయభాను కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో మిరియాల పొంగలి ప్రసాదం ఏర్పాటు చేయగా అమ్మవారికి నివేదించి అనంతరం భక్తులకు పంపిణీ చేశారు,
శ్రీ దుర్గాలమ్మ ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో శ్రీ లింగాబత్తుల అనిల్ కుమార్, సునీత దంపతులు ఆర్ధిక సహాయంతో మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది,
ఈ కార్యక్రమంలో శ్రీదుర్గాలమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, ఉపాధ్యక్షులు పి.వి.జి.అప్పారావు, సెక్రటరీ నాగోతి తాతారావు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు, సభ్యులు పొట్నూరి హరికృష్ణ, బోగవిల్లి రాము, పిళ్లా రాజు, కేశనకుర్తి అప్పారావు,
ముఖ్య సభ్యులు పిళ్లా పోతరాజు, పిళ్లాఠ వెంకటరమణ, సుందర శ్రీను, రమేష్, గరె రామారావు, పోతిన రాంబాబు మరియు అమ్మవారి సేవకులు గుప్తా, కృష్ణ
పద్మశాలి ఆత్మీయ సేవా సంఘం అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు, సభ్యులు పి.నాగేశ్వరరావు, యన్.షణ్ముఖరావు, బి.పాండు రంగ విఠల్ తదితరులు పాల్గొన్నారు..