టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా రెడీ అంటోన్న వైసీపీ ఎమ్మెల్యేలు.


దీపం ఉండగానే ఇల్లు సర్దుకోమన్నట్టుగా.. వైసీపీలోనే ఒకరిద్దరు నాయకులు సొంతగానే ప్రజాబలం వైపు మొగ్గు చూపుతున్నారు. పార్టీలో అసమ్మతి పెరుగుతుండడం.. వారు తమ పంథాలను మార్చుకునే పరిస్థితి లేకపోవడం.. పైగా.. దూకుడు ఎక్కువగా ఉండడం వంటి కారణాలతో ఎమ్మెల్యేలు.. ఒకరిద్దరు.. అవసరమైతే.. మేం మా అంతటగా గెలిచేందుకు రెడీ  అంటూ.. పరోక్షంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇది పార్టీకి హాని చేయకపోయినా.. రాజకీయంగా మాత్రం చర్చకు వస్తోంది.ఇలాంటివారిలో ముందున్నారు.. చిత్తూరు జిల్లాలోని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా. ఆమెకు ఉన్నఅసమ్మతి.. అంతా ఇంతా కాదు. సొంత పార్టీలోనే సెగలు పుడుతున్నాయి. ఆమెకు వ్యతిరేకంగా.. ప్రచారం నిత్యం జరు గుతూనే ఉంది. అంతేకాదు.. ఒక కీలక మంత్రి ఏకంగా.. రోజాకు వ్యతిరేకంగా చక్రం తిప్పుతున్నారనే వాదన కూడా పార్టీలో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోతే.. అవసరమై తే.. ఇండిపెండెంట్గా పోటీ చేయాలని.. ఆమె నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ప్రజలకు బాగా చేరువ అవుతున్నారు. వారి సమస్యలు పరిష్కరిస్తున్నారు.

స్వచ్ఛంద సేవలు కూడా ప్రజలకు చేరువ చేస్తున్నారు. సో.. రోజా వ్యూహం అదిరిపోయేలా ఉందనే వాద న విశ్లేషకుల నుంచి కూడా వినిపిస్తోంది. మరోవైపు.. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోనూ.. బుర్రా మధుసూదన్యాదవ్కు కూడా టికెట్ దక్కే అవకాశం లేదని..ప్రచారం జరుగుతోంది.

ఆయన ప్రజలకు చేరువ అవడం లేదని.. వ్యాపారాలు వ్యవహారాల్లో మునిగిపోయారని సొంత పార్టీలోనే వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తోంది. దీంతో మధు కూడా వచ్చే ఎన్నికల్లో కనుక తనకు టికెట్ ఇవ్వకపోతే.. సత్తా చూపించాలని అనుకుంటున్నారు. అయితే.. ఆయన.. ఇండిపెండెంట్గా కాకుండా.. ఒక కీలక పార్టీ తరఫున బరిలోకి దిగాలని భావిస్తున్నారు.
ఇక ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి భారీ మెజారిటీతో విజయం దక్కించుకున్న అన్నారాంబాబుకు కూడా టికెట్ ఇవ్వొద్దని.. పార్టీలో ఇప్పటికే వందల మంది అభ్యర్థనలు చేశారని ప్రచారం జరుగుతోంది. ఆయన తమను పట్టించుకోవడం లేదని.. ప్రజలకు కూడా చేరువ కావడం లేదని..ఎన్నికలకు ముందు ఉన్న హవా ఇప్పుడు లేదని..ఆయనకు టికెట్ ఇస్తే.. పార్టీ ఓడిపోవడం ఖాయమని .. పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.


దీంతో ఆయన కూడా ముందు జాగ్రత్త పడుతున్నారు. పార్టీ టికెట్ ఇవ్వకపోతే.. ఒంటరిగా అయినా పోటీ చేసేందుకు తాను సిద్దమని వ్యతిరేకులకు ఆయన గట్టిగానే సంకేతాలు పంపుతున్నారు.  మొత్తానికివైసీపీలో చాలా మంది నేతలకు తమ తమ వ్యూహాలను రెండేళ్లకు ముందుగానే సిద్ధం చేసుకుంటుండడం గమనార్హం.