చంద్రంపాలెం జాతర గట్టు . పై కొలువై ఉన్న దుర్గాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు.

చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆలయంలో నిమ్మకాయల దీపాలు వెలిగించన మహిళా భక్తులు! భీమిలి నియోజకవర్గం,మధురవాడ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను) మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారికి ఫాల్గుణ మాసం కృష్ణ పక్షం సప్తమి శుక్రవారం సందర్భంగా నిత్య అర్చనలతో పూజా కార్యక్రమాలు ప్రారంభించి ప్రత్యేక కుంకుమార్చనలు, పుష్పార్చనలు తదితర పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు పట్నాల హరి ప్రసాద్ శర్మ, హరి చరణ్ లు తదితరులు జరిపించి నీరాజన మంత్రపుష్పం అమ్మవారికి సమర్పించి భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన లో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని పసుపు కుంకుమలు సమర్పించి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయల దీపాలు వెలిగించి అమ్మవారికి సమర్పించారు, ఈ సందర్భంగా బక్కన్నపాలెం వాస్తవ్యులు కిరణ్ కుమార్, భాగ్యశ్రీ గారి కుటుంబ సభ్యులు సహకారముతో ఏర్పాటు చేసిన మిర్యాల పొంగలి ప్రసాదమును అమ్మవారికి సమర్పించి అనంతరం భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు పంపిణీ చేశారు, సాయంత్రం వేళ శ్రీదుర్గాలమ్మ అమ్మవారికి పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, జలాభిషేకం చేసి ప్రత్యేకంగా అలకరణ చేసి కుంకుమార్చనలు పుష్పార్చనలు చేసి నీరాజనం మంత్రపుష్పం సమర్పించి అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు, ఈ కార్యక్రమంలో శ్రీదుర్గాలమ్మ అమ్మవారి ఆలయ ధర్మకర్త పిళ్లా చంద్రశేఖర్, ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, ఉపాధ్యక్షులు పి.వి.జి.అప్పారావు, సెక్రటరీ నాగోతి తాతారావు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పిళ్లా మోహన్ శివకృష్ణ, కమిటీ సభ్యులు పిళ్లా వెంకటరమణ, పోతిన పైడిరాజు, బోగవిల్లి రాము, పొట్నూరి హరికృష్ణ, కేసనకుర్తి అప్పారావు, ముఖ్య సభ్యులు పిళ్లా పోతరాజు, పిళ్లా వెంకటరమణ, పిళ్లా అప్పన్న, యస్.శ్రీను, దుక్క అప్పారావు, యస్.రమేష్, పి.రాంబాబు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.