విశాఖ జిల్లా బాలల హక్కుల కన్వీనర్ గా సిహెచ్ విశాలాక్షి..
February 17, 2025
బాలల హక్కుల ప్రతినిది.సి.హెచ్ విశాలాక్షి జిల్లా కన్వీనర్ గా ఏక గ్రీవ ఎన్నిక.
(విశాఖపట్నం, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
గత కొన్నేళ్లుగా బాల ల హక్కుల పరిరక్షణ కు కృషి చేస్తున్న ఆంధ్ర ప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ వేదిక వార్షిక సమావేశం ఆదివారం 16వ తేదీన విజయవాడ వేదికగా జరిగింది. ఈ వేదికలో 14 జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎం.వి.ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఎం.వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో రాష్ట్రము లో బాలల హక్కుల పరిరక్షణ గురించి చర్చిచారు. ముఖ్యం గా వెచ్చే బడ్జెట్ లో 20 శాతం విద్య కు కేటాయించాలని...విద్యావిధానం ప్రకటించ్చాలని..ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని తీర్మాణించారు. అనంతరంరెండేళ్ల కాల పరిమితికి వేదిక కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
విశాఖ జిల్లా కన్వీనర్ గా నగరానికి చెందిన సుపరిచితురాలు దాత్రి స్వచ్ఛంద సేవా సంస్థఅధ్యక్షు రాలు సి.హెచ్. విశాలక్షీ ని ఎకగ్రీవంగా ఎన్నున్నారు. ఈమె ఎన్నిక ద్వారా విశాఖ జిల్లా కు సమచిత స్థానం దక్కింది. ఈమె ఏకగ్రీవ ఎన్నిక పట్ల విశాఖ స్వంచ్ఛంద సంస్థ ల ఫోరమ్ సలహా దారుడు నరవ ప్రకాశ రావు హర్షం వ్యక్తం చేశారు.