ఈనెల 21న జరగనున్న యోగాంధ్ర ను విజయవంతం చేయండి. విశాఖ ఖ్యాతిని విశ్వయాప్తం చేయండి --- భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా పిలుపు.
June 15, 2025
యోగాంధ్రతో విశాఖ ప్రతిష్ట విశ్వవ్యాపితం
భీమిలి ఎమ్మెల్యే గంటా.
భీమిలి నియోజకవర్గ0 ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)
యోగాంధ్రను విజయవంతం చేయడం ద్వారా విశాఖ ప్రతిష్టను విశ్వవ్యాపితం చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈనెల 21 న జరగనున్న యోగాంధ్ర నిర్వహణ ఏర్పాట్లపై పీఎం పాలెం వి - కన్వెన్షన్ హాల్లో శనివారం జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ . గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో విశాఖ పేరు నమోదు కానున్న నేపథ్యంలో యోగాంధ్ర నిర్వహణను సవాల్ గా తీసుకోవాలన్నారు. హుద్ హుద్ తుపాను తీవ్రత నుంచి విశాఖ ప్రజలు వేగంగా కోలుకున్న తీరు ప్రధాని మోదీని ఆశ్చర్యపరిచిందని.. ఇక్కడి ప్రజల అంకితభావం, క్రమశిక్షణ పట్ల ఆకర్షితులై యోగాంధ్రకు విశాఖను ఎంపిక చేశారని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకమైన యోగాంధ్రను సమష్టి కృషితో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమం గురించి తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారంటే యోగాంధ్ర ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చని తెలిపారు. మండల, సచివాలయాల స్థాయిలో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని సూచించారు. 15 కిలో మీటర్ల భీమిలి బీచ్ వెంబడి యోగా జరుగుతుందన్నారు. విశాఖ సహా శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు బోయపాలెం, మారికవలస, ఎండాడ దగ్గర పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నామని అధికారులు చెప్పారు. జనసేన భీమిలి ఇంచార్జ్ పంచకర్ల సందీప్, ఆర్డీఓ కె సంగీత్ మాధుర్, యూసీడీ పీడీ సత్యవాణి, కె. జ్ఞానవేణి, హౌసింగ్ పీడీ సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.