చంద్రంపాలెం దుర్గాలమ్మ ఆలయ ప్రాంగణంలో నిరంతరం మజ్జిగ సేవ పాదచారుల దాహార్తిని తీరుస్తున్న ఆలయ కమిటీ..

శ్రీపంచముఖ ఆంజనేయ స్వామి వారికి విశేష పూజలు! శ్రీదుర్గాలమ్మ ఆలయ ప్రాంగణంలో నిరంతరాయంగా కొనసాగుతున్న చలివేంద్రం. భీమిలి నియోజకవర్గం, (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను) విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీదుర్గాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో క్షేత్ర పాలకునిగా ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో జ్యేష్ట మాసం కృష్ణ పక్షం తదియ శనివారం సందర్భంగా స్వామివారికి పూల మాలలు తులసి మాలలు, వడ మాలలతో అలంకరణ అనంతరం సింధూర అర్చన, తమలార్చన, నీరాజన మంత్ర పుష్పం మొదలగు పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ, హరి స్వామి తదితరులు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు, చంద్రంపాలెం జాతర గట్టు శ్రీదుర్గాలమ్మ అమ్మవారి ఆలయం ఆవరణలో కమిటీ ఆధ్వర్యంలో కొద్ది నెలలుగా నిరంతరాయంగా కొన సాగుతున్న చలివేంద్రంలో శనివారం మధురవాడ వాస్తవ్యులు శివశక్తి సాయి ఇంజనీరింగ్ వారు షణ్ముఖరెడ్డి భానుమూర్తి తదితరులు చలివేంద్రానికి సహాయ సహకారాలు అందించగా దాతలు, ఆలయ కమిటీ సభ్యులు ఆలయం ముందు ఉన్న రోడ్డులో ప్రయాణాలు సాగిస్తున్న వాహన దారులకు, పాదచారులకు, ఆలయానికి వచ్చే భక్తులకు మజ్జిగ పంపిణీ చేసి దాహార్తిని తీర్చడం జరిగింది, శ్రీ దుర్గాలమ్మ ఆలయ ధర్మకర్త పిళ్లా చంద్రశేఖర్, ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్లా సూరిబాబు, సెక్రటరీ నాగోతి తాతారావు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు సభ్యులు పిళ్లా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు, భక్తులకు, పాదచారులకు వాహానాల మీద ప్రయాణాలు సాగిస్తున్న వాహన దారులకు చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేసి వారందరి దాహార్తిని తీర్చారు.