ఎం వి వి.సిటీ సాయి సెంటర్ భజన మండలి ఆధ్వర్యంలో ముగిసిన మజ్జిగ సేవ.

విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ.) భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 01.05. 2025 తేదీన గురువారం ప్రారంభమైన చలివేంద్రం (మజ్జిగ పంపిణీ) కార్యక్రమం 15.06.2025 తేదీ ఆదివారం మజ్జిగ సర్వీస్ అనంతరం నామ సంకీర్తనచేసి స్వామివారికి మంగళహారతితో ముగింపు చేయడం జరిగినది. మొత్తము గ ఈ చలివేంద్రం సర్వీస్ నందు 9,570 లీటర్ల మజ్జిగ 38,280 పాదాచారులకు వేసవి వేడిమి సందర్భంగా దాహార్తిని తీర్చటం మా సాయి సెంటర్ సభ్యులందరికీ చాలా సంతోషాన్ని ,తృప్తిని కలిగించిందని, ఈ 45 రోజుల సేవా కార్యక్రమంలో 540 మంది సేవాదళ్ సభ్యులు తమ సేవలు అందించారని , ఈ సేవ కార్యక్రమానికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సేవలు అందించిన ప్రతి ఒక్కరికి, మరియు దాతలు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఎంవీవీ సిటీ శ్రీ సత్యసాయి సెంటర్ నిర్వాహకులు టంకాల శివాజీ , ఏ వీ రామకృష్ణారావ్ లు తెలిపినారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా సేవాదళ్ సమన్వయకర్త ఆర్ ఏ నాయుడు మాట్లాడుతూ ఎంవీవీ సిటీ శ్రీ సత్యసాయి సెంటర్ నిర్వాహకులు చాలా మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఇంకా సమాజానికి ఉపయోగపడే మంచి సేవలలో పాల్గొనాలని కొనియాడారు. ఆగస్టు 15 ,16, 17 పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో జరుగు పర్తి యాత్ర లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దిగ్విజయం చేయాలని ఈ సందర్భంగా కోరారు.కార్యక్రమంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ స్టేట్ కోఆర్డినేటర్ రాజా గారు, పీ యం పాలెం సమితి కన్వీనర్ ప్రభాకర్ గారు, వేదం గురువుగారు రామినాయుడు గారు అధిక సంఖ్యలో భక్తులు, సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.