వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో చెరకు ధర్మరాజు జయంతి సందర్భంగా ధర్మరాజు శ్రీమతి సునీత కుమారుడు కృష్ణమూర్తి కోడలు అపర్ణ ఆర్థిక సహాయంతో భీమ్ నగర్ ఏ యు టి డి జీవీఎంసీ నిర్వహణలో నడుస్తున్న నిరాశ్రయుల వసతి గృహం నందు , వయో వృద్ధులకు అన్నదానం..
January 18, 2026
విశాఖ సిటీ(,ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
వి 201ఏ లో రీజియన్ 2, జోన్ 2 నందు గల
వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో అల్లినగరం లో భీమ్ నగర్ ఏ యు టి డి, జీవీఎంసీ నిర్వహణలో నడుస్తున్న నిరాశ్రయుల వసతి గృహమందు ఉన్న వయో వృద్ధులకు
తేదీ 18.01.2026 ఆదివారం నాడు రాత్రి 7 గంటలకు 30 నిమిషములకు కీర్తిశేషులు శ్రీ చెరుకు ధర్మరాజు గారి జయంతి సందర్భంగా వారి శ్రీమతి సతీమణి సునీత, కుమారుడు క్రిష్ణ మూర్తి, కోడలు అపర్ణ గార్ల ఆర్ధిక సహాయం తో అన్నదానంఏర్పాటుచేయడమైనది. ఈ కార్యక్రమంలో క్లబ్బు చార్టెడ్ అధ్యక్షులు చెరుకు కృష్ణ , ప్రోగ్రాం చైర్మన్ పాలూరి శివరామకృష్ణ మరియు పూర్వపు అధ్యక్షులు వాసవియన్ గ్రంధి కృష్ణారావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏ యు టి డి సిబ్బంది దాతలకు , ఎంవిపి కపుల్స్ సభ్యులకు ధన్యవాదములు తెలిపినారు.
