ఆనందపురం మండలంలో బి ఎల్ ఏ లకు ఐడి కార్డులు పంపిణీ చేసిన చిన్న శ్రీను. బి ఎల్ ఏ లు అంతా బి ఎల్ ఓ లతో సమన్వయం చేస్తూ అర్హులై ఓటర్ లను చేర్పించండి.. ప్రజలతో సత్సంబంధాలు పెంచుకొని ఓటర్ల నమోదులో బిఎల్వోలకు సహకరిస్తూ ముందుకు సాగండి. వైసీపీ బీఎల్ఏలకు భీమిలి నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ చిన్న శ్రీను దిశా నిర్దేశం. సమావేశంలో పాల్గొన్న సిరమ్మ.భీమిలి మండలం, జీవీఎంసీ వార్డుల బీఎల్ఏల సమావేశంలో SIRపై దిశానిర్దేశం చేసిన చిన్న శ్రీను గారు,వారి కుమార్తె సిరమ్మ.భీమిలి నియోజకవర్గం,ఆనందపురం, జూన్ 27:. భీమిలి నియోజకవర్గం, ఆనందపురం మండల ప్రజా బలం న్యూస్ ఆన్లైన్: (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భీమిలి మండలం మరియు జీవీఎంసీ 1, 2, 3, 4 వార్డుల బీఎల్ఏల సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు.ఈ సమావేశానికి *గౌరవ ఉమ్మడి విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే వారి కుమార్తె సిరమ్మ* కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా Special Intensive Revision (SIR) కార్యక్రమంపై బీఎల్ఏలకు సమగ్ర అవగాహన కల్పించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని, బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు)తో సమన్వయంగా పనిచేస్తూ అర్హత కలిగిన ఒక్క ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోకుండా చూడాలని సూచించారు.ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, అభ్యంతరాల పరిష్కారంలో అవసరమైన సహకారం అందించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం బీఎల్ఏలకు గుర్తింపు కార్డులను మజ్జి శ్రీనివాసరావుగారు మరియు సిరమ్మ అందజేసి, ఓటు హక్కు పరిరక్షణ ప్రతి కార్యకర్త బాధ్యత అని పేర్కొన్నారు.ఈ సమావేశంలో మండల ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, బీఎల్ఏలు, సోషల్ మీడియా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.