ముందుకు దూసుకుపోతున్న జనంతో జనసేన -- డాక్టర్ పంచకర్లకు ఘన స్వాగతం

 


 భీమిలి నియోజకవర్గం  (ఆనందపురం ) మధురవాడ ---ఆనందపురంలో అత్యంత ఉత్సాహంతో రెండో రోజు ప్రారంభమైన జనంతో జనసేన --- భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ తీసుకొని జనసేన పార్టీ ముందుకు నడుస్తుందని భీమిలి జనసేన పార్టీ సమన్వయకర్త సందీప్ పంచ్కర్ల పేర్కొన్నారు. మంగళవారం జనంతో జనసేన లో భాగంగా ఆనందపురం కూడలి వేములవలసలోని ఎస్ సి కాలనీ లోని అంబేద్కర్ విగ్రహానికి ముందుగా పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ జనసేన ప్రభుత్వం రాగానే ప్రభుత్వం అందించబోయే పలు అభివృద్ధి పథకాలు వివరించారు. అలాగే అర్హులైన యువకులకు 10 లక్షల రూపాయలు రుణ సాయం, ప్రతి ఏటా ఐదు లక్షల ఉద్యోగాలు, ఉచితంగా ఇసుక పంపిణీ, ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయడం, లాభసాంటివ్యవసాయం,విశాఖ తిరుపతి ఐటి హబ్బులు గా అభివృద్ధి చేయడం వంటి విషయాలు ను వివరించారు.అలాగే నియోజకవర్గం ఉన్న పలు సమస్యలు పై జనసేన చేస్తున్న పోరాటలను వివరించారు

. ఈ కార్యక్రమం లో బి.వి. కృష్ణయ్య, ఈ. యన్. ఎస్ చంద్రరావు, ఎన్. ఎన్. నాయుడు, శాఖరి శ్రీనుబాబు. ఆనందపురం మండలం నాయుకులు వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు. తొలిరోజు పర్యటనలో పంచకర్ల.