పలు సేవా కార్యక్రమాల్లో బాల వికాస్ విద్యార్థులు, ఉన్న ఊరు కన్నతల్లి, గురువే బ్రహ్మం గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు, తల్లిదండ్రులను మించిన దైవం లేదు అని నిరూపించిన సత్యసాయి..... (నలుగురు పాలికాపర్లు వారి యజమాని స్వామి దర్శనం దానిని గుర్తుపెట్టుకుని కన్వీనర్లు పనిచేస్తే సత్య సాయి భక్తులు , భారీ సంఖ్యలో పెరుగుతారు. ఎంవిపిలో చేసే ప్రతి ఉపన్యాసం పెద్దలు గుర్తుంచుకొని ముందుకు నడపాలి)

🙏🏾🌹పీఎం పాలెం సత్యసాయి సేవా సమితి 🙏🏾🌹 మధురవాడ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను, పాత మధురవాడ.(.9502817542) భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో ఎం వివి సిటీ శ్రీ సత్యసాయి సెంటర్ లో మంగళవారం ఈశ్వరాంబ వర్ధంతి పురస్కరించుకొని ఉదయం బాల వికాస్ గురువులు జ్యోతి, నాగవేణి నిర్వహణలో బాలవికాస్ పిల్లలచే స్వామివారి అష్టోత్తరం తండులార్చన గావించి, బాలవికాస్ పిల్లలకు డ్రింకులు, పెన్సిల్స్, ఎరేజర్స్ అందజేశారు. అనంతరం ఎంవివి సిటి జంక్షన్ వద్ద గల బస్ స్టాప్ నందు ఎం వి వి సిటీ శ్రీ సత్యసాయి సెంటర్ నిర్వహిస్తున్న చలివేంద్ర నందు బాలవికాస్ పిల్లలచే మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సేవాకార్యక్రమంలో సాయి భక్తుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ------------------------------ పిఎం పాలెం ప్రేమాలయంలో.... బాల వికాస్ విద్యార్థులు పలు సాంస్కృతి నిర్వహించారు. వారికి బహుమతులు కూడా అందజేశారు. బాల వికాస్ తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు. ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా సత్య సాయి తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలో, ఏ విధంగా పూజించాలో కన్న తల్లి ఉన్న ఊరు మరిచిపోరాదని నిరూపించిన సత్యసాయి తన విద్యార్థులే తన సంపదని ఆనాడే స్వామి తెలియజేశారు. బాల వికాస్ గురువులు చేస్తున్న సేవ ఎంతోమంది పేద విద్యార్థులకు దోహదపడుతుందని రూపాయి ఖర్చు పెట్టకుండా చేసేదానం విద్యా దానమని బాలవికాస్ గురువులను సత్య భగవానుడు ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తుంటాడని భక్తులు ప్రగాఢమైన నమ్మకం.. స్వామి తల్లిదండ్రులు వర్ధంతి జయంతులను జరపడం ద్వారా ప్రపంచానికి తల్లిదండ్రుల ఆవశ్యకత, గురువుల ఆవశ్యకత, ఉన్న ఊరి పై ప్రేమను ఏ విధంగా చూపించాలనేది తన భక్తులకు తాను చేసే సేవా కార్యక్రమాల ద్వారా నిరూపించారు. వాటన్నిటిని ఆదర్శంగా తీసుకొని సాయి భక్తుల ముందుకు నడవాలని ఆనాడే పేర్కొన్నారు. 🙏🏾🌹🌹 అందుకు చక్కని ఉదాహరణ అనేకమైనవి స్వామి చెప్పి చూపించారు.. నలుగురు పాలికాపర్లు స్వామి దగ్గరికి తన యజమాని ద్వారా స్వామి దర్శనానికి వెళ్తే జరిగే సంఘటన భక్తులందరికీ ప్రధానమైన ఉదాహరణగా చెప్పవచ్చు.. దానిని గ్రహించుకొని ఏదైతే ఎంవిపి కాలనీలో తమ ప్రసంగాలు చేశారో వాటిని అనుసరించి కన్వీనర్లు ముందుకు నడవాలని స్వామి చెప్పిందే చేసే విధంగా వారు కృషి చేసినట్లయితే పుట్టపర్తి కి వెళ్లే జనాలు మరింత పెరుగుతారని స్థానిక భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.