విశాఖ ఎంవి వి సిటీలో ఎంవిపి వాసవి క్లబ్ కపుల్స్ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన గవర్నర్. తమ్మన అమర్నాథ్. క్లబ్బు విస్తరణ పై ప్రణాళిక. ఇంతవరకు చేసిన సేవా కార్యక్రమాలపై అధ్యక్షుడు రామకృష్ణను అభినందించిన అమర్నాథ్. భవిష్యత్ కార్యాచరణ పై చర్చ. అమర్నాథ్ను సన్మానించిన క్లబ్

జై వాసవి.. జై జై వాసవి. V 201 A *గవర్నర్ తమ్మన అమర్నాథ్* ప్రజా బలం న్యూస్ ఆన్లైన్ :విశాఖ సిటీ సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ 9502817542) జీవీఎంసీ 8 వార్డ్ పరిధిలో గల ఎంవీవీ సిటీ లో నివాసం ఉంటున్న ఎంవిపి వాసవి క్లబ్ కపుల్స్ అధ్యక్షులు రామకృష్ణ, సెక్రటరీ ట్రెజరీలతో ఆదివారం *వి201 ఏ గవర్నర్ తమ్మన అమర్నాథ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల బాగోగులను తెలుసుకొని ఎంతో ఆత్మీయంగా కలుసుకున్నారు. అనంతరం తమ సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను చర్చించుకున్నారు. ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణ గురించి మరింత ముందుకు పోయే విధంగా ఒక అవగాహనకు వచ్చారు. క్లబ్బుకు సంబంధించి శాశ్వత ప్రాజెక్టుల పైన, చర్చించారు. గరుకు స్తంభం ఏర్పాటు చేసే దశగా ప్రయత్నం జరగడంతో పాటు, క్లబ్ సభ్యులు పెంచే విధంగా, అదే స్థాయిలో సేవా కార్యక్రమాలను విస్తృతం చేసే విధంగా గవర్నర్ సూచించారు. ఈ క్లబ్ అభివృద్ధి కోసం తగిన ప్రణాళిక రచించారు.🌹 గవర్నర్ తమ వద్దకే వచ్చి క్లబ్ సభ్యులు ఇంటింటికి వచ్చి వెళ్లి తమ ఆత్మీయ పలకరింపుతో మాలో మరింత ఉత్సాహం నింపి,ప్రోత్సహించడం పట్ల ఎంతో నిబద్ధత పట్టుదల కలిగిన ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తో పాటు ఆ వాసవి మాత, సత్య సాయి భగవానుడు మా అందరినీ ముందుకు నడిపించే విధంగా క్లబ్బు మరింత విస్తరించే విధంగా తగిన శక్తి ఇవ్వాలని ఈ సందర్భంగా రామకృష్ణ ప్రార్థించారు.. అంతకుముందు గవర్నర్ కు గౌరవపూర్వకంగా సాలువ కప్పి సన్మానం చేశారు.