ఘనంగా చిన్న శ్రీను సోల్జర్ అధ్యక్షురాలు సహస్రమ్మ జన్మదిన వేడుకలు
June 19, 2025
ఘనంగా చిన్న శ్రీను సోల్జర్ అధ్యక్షురాలు,సహస్రమ్మ, జన్మదిన వేడుకలు,.. మధురవాడ మీడియాకు అవమానం.. మధురవాడ నాయకులను పట్టించుకోని వైనం. కానరాని వార్డ్ అధ్యక్షుడు లు.
మధురవాడ, ప్రజా బలం న్యూస్ ఆన్లైన్ :
చిన్న శ్రీను సోల్జర్ అధ్యక్షురాలు, భీమిలి వైసీపీ ఇన్చార్జి చిన్న శ్రీను కుమార్తె సహస్త్ర, సిరమ్మ జన్మదిన వేడుకలు ఆనందపురం శుభశ్రీ కళ్యాణ మండపంలో ఘనంగా జరిగాయి. గురువారం మధ్యాహ్నం భీమిలి నియోజకవర్గం కార్యకర్తలు అభిమానులు మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు కార్యకర్తలు ఆమెకు పుష్పగొచ్చాలు ఇచ్చి, పూలదండలు వేసి, సాలువ కప్పి సన్మానాలు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సిరమ్మ భీమిలి నియోజకవర్గంలో ఉన్న జర్నలిస్టులకు ఎలక్ట్రికల్ కుక్కర్లు కానుకలు ఇచ్చారు. జర్నలిస్టులు అందరూ ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానంగా మధురవాడ ప్రాంతం నుండి వైసీపీ సీనియర్ నేత పిల్లా సూరిబాబు, ఎండాడ క్వారీ సొసైటీ అధ్యక్షుడు సీనియర్ వైసీపీ నేత పిల్లా అప్పన్న, వైసీపీ వీరాభిమానిజాలీల నాగభూషణ్, ఆరవ వార్డ్ వైసీపీ అధ్యక్షుడు బి.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
శిరమ్మను ఆశీర్వదించేందుకు మధురవాడ ప్రాంతం నుండి అతి తక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. పైగా అక్కడకు వెళ్లిన వారికి సరైన గౌరవం కూడా ఇవ్వలేదు. కనీసం వారిని పిలిచి పలకరించలేదు. వారంతల వారే సిరమ్మ దగ్గరకు వెళ్లి ఫోటో తీసుకునేందుకు ఉత్సాహం కనబరిచారు. అక్కడకు రాణి నాయకులను వేదిక పైకి పిలిచారు.
సభకు అధ్యక్షత వహించిన నాయకుడు బంక సత్యం అత్యుత్సాహం చూపించారు. మీడియాని సైతం ఎగతాళి చేశారు. సభా వేదికపై విలేకరులను వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా గిఫ్టులు ఇచ్చేటప్పుడు కమ్మేసి ఇవ్వడం మీడియో పేర్లు సరిగా చదవకపోవడం అక్కడ పిఏ కన్ఫ్యూజ్ అయ్యాడు. ఆందోళన కూడా చెందాడు.
. ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పే వారిని పిఏ మరిచిపోయారు. దీంతో మధురవాడ విలేకరుల గందరగోళం ఏర్పడింది. కొంతమందిని పిలవడం కొంతమందిని పిలవకపోవడం బాధపడి తిరిగి వచ్చేసారు. అక్కడికి వచ్చిన వాళ్ళు భోజనం కూడా చేయకుండా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇటువంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా నిర్దిష్టమైన సమాచారంతో మీడియాను పిలవాలని పలువురు కోరుతున్నారు.w వేదికపై పిలిచేటప్పుడు గౌరవంగా పిలవాల్సిన ఆ సీనియర్ పెద్దమనిషి ఉన్న గౌరవం తీసుకోకుండా తన గౌరవాన్ని నిలబెట్టుకొని ముందుకు నడవాలని పలువురు కోరుతున్నారు.
ఈ సందర్భంగా సహస్రమ్మ మాట్లాడుతూ ఇంతవరకు విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో సేవ చేసే అవకాశం దక్కిందని, ఈ రోజు నా పుట్టిన రోజు సందర్భంగా విశాఖ లో కూడా సేవ చేసే అవకాశం వచ్చిందని తనని పెద్దలందరూ ఆశీర్వదించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిన జగనన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాను అందరికీ రుణపడి ఉంటానని అందుకు ఎల్లవేళలా ప్రజలకు సేవ చేసేందుకు కృషి చేస్తానన్నారు.