డాన్ టు డస్క్ --- ఎంవిపి వాసవి క్లబ్ కపుల్స్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు.

విశాఖ సిటీ (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశాల మేరకు తేది 22- 06- 2025 ఆదివారం డాన్ టు డస్క్ (ఉదయాస్తమాన సేవలలో)* భాగంగా వాసవీ క్లబ్ ఎం వి పి కపుల్స్ సభ్యులు ముఖ్య అతిథులు గా విచ్చేసిన వాసవియన్స్ ప్రవీణ్ కుమార్, సావిత్రి, తిరుపతి రావు, పుష్పలత, సతీష్, కమల కుమార్ తదితర జిల్లా ఆఫీసర్ల సమక్షంలో *సెక్టార్..6 లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో* క్లబ్ సభ్యులు సహకారంతో స్థాపించిన *గరుకు స్తంభము* ముఖ్యఅతిథి చే ప్రారంభోత్సవం *దేశ పరిరక్షణ* నిమిత్తం సేవలు అందించిన మాజీ సైనికులు గురుమూర్తి కి చిరు సన్మానం, చిన్న వయసులో భర్తను కోల్పోయి,చెప్పులు కుట్టి కుటుంబ పోషణ సాగిస్తున్న మహాలక్ష్మి కి అవసరమయిన పనిముట్లు పంపిణీ, *లుంబినీ పార్క్ దరి సీతా రామ సాగర లింగేశ్వర ఆలయములో* భక్తులు విశ్రాంతి తీసుకొనుటకు (సింహాచలం వాస్తవ్యులు సన్యాసి శెట్టి సహకారంతో ఏర్పాటు చేసిన *రెండు సిమెంట్ బెంచీలు* ప్రారంభోత్సవం. విద్య నిధి సేవ కోసం (3 కే సీ జీ ఎఫ్ లు ) రూ.7500/- వికలాంగులకు మనో నేస్తం సేవ నిమిత్తం రూ.1500/- లు వి సి ఐ వారికి చెల్లించుట. వాసవీ క్లబ్ యూనివర్సల్ లో 10 మంది నూతన సభ్యులను చేర్పించుట మొదలైన కార్యక్రమము చేయడమైనది. ముఖ్యఅతిథి మాట్లాడుతూ క్లబ్బు చేస్తున్న కార్యక్రమాల్ని కొనియాడుతూ అధ్యక్షుడు రామకృష్ణరావు కి పెండెంట్ తో కూడిన చైన్ బహుకరించినారు.వచ్చిన అతిధులు అందరికీ సత్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో వాసవి యన్స్ చెరుకు కృష్ణ, కృష్ణారావు, గోగుల నరసింగరావు , మల్లేశ్వర గుప్త, హరగోపాల్, కాపుగంటి వెంకట రమణ మూర్తి,పాలూరి చంద్ర శేఖర్ గుప్తా,చెరుకూరి నర్సింగరావు,పాలూరి శివ రామకృష్ణ, దాసరి సన్యాసి శెట్టి , మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ధన రూపేణా, వస్తు రూపేణా, ప్రత్యక్షముగాను,పరోక్షంగానూ సహాయ సహకారములు అందించిన ప్రతీ ఒక్కరికీ .... అధ్యక్షులు రామకృష్ణారావు హృదయ పూర్వక ధన్యవాదములు తెలియజేసినారు.