యోగాంధ్రలో ఎం వి పి వాసవి క్లబ్ కపుల్స్ అధ్యక్షులు రామకృష్ణ.. గురువుకు సన్మానం.
June 21, 2025
జై వాసవి. జై జై వాసవి
విశాఖ సిటీమధురవాడ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్:
తేదీ జూన్ 21, 2025, శనివారం,
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తలపెట్టిన యోగ ప్రక్రియలో భాగంగా విశాఖపట్నం బీచ్ రోడ్డు నందు గల శాంతి ఆశ్రమం ప్రక్కన C16 బ్లాక్ నందు యోగాలో వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా యోగా గురువుగార్లు , క్లబ్బు పూర్వపు అధ్యక్షులు వాసవియన్ గ్రంధి కృష్ణారావు కి, క్లబ్బు కార్యక్రమాల అధ్యక్షులు వాసవియన్ పాలూరి శివరామకృష్ణ కి యోగా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ సాలువతో సత్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో క్లబ్బు అధ్యక్షులు వాసవియన్ వెంకట రామకృష్ణారావు, కోశాధికారి చంద్రశేఖర్ గుప్తా, చార్టర్ ప్రెసిడెంట్ చెరుకు కృష్ణ, మరియు క్లబ్ సభ్యులు చెరుకూరి నర్సింగరావు పాల్గొన్నారు.