మధురవాడలో ప్లే స్కూల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభోత్సవం చేసిన ఏయూ పూర్వ ఆచార్యులు మాకిన నారాయణ పాత్రుడు...

మధురవాడ (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ) మధురవాడ జె ఆర్ నగర్ లోని పీ.ఎం. పాలెం పోలీస్ స్టేషన్ వెనుక రోడ్లో ఈఎస్ జె ప్లే స్కూల్ గురువారంఘనంగా ప్రారంభమైంది. ఆంధ్ర యూనివర్సిటీ ఆర్థిక శాస్త్ర విశ్రాంత ఆచార్యులు మాకిన నారాయణ పాత్రుడు ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి తరగతి గదులు ప్రారంభించారు.. అనంతరం ప్లే స్కూల్ చైర్మన్ పోతిన శివ లింగేశ్వరరావు మాట్లాడుతూ బెంగుళూరు కి చెందిన క్రీడో విద్యాసంస్థ ఇండియాలో 3 వేల పైచిలుకు బ్రాంచులు కలిగి ఉందని ఆ విద్యాసంస్థ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఈ ప్లే స్కూల్ నిర్వహణ ఉంటుందని అన్నారు. బాల బాలికల మెదడు పదును పెట్టే విధంగా మూడు నుంచి ఐదు సంవత్సరాల వయసు కలిగిన చిన్నారులు జవాబులు కోసం వెతుక్కోకుండా ప్రశ్నలు సంధించేలా సులభంగా వారికి అర్థమయ్యేలా విద్యా బోధన ఉంటుందని పేర్కొన్నారు. స్కూల్ నిర్వాహకులు మీనా కుమారి,ప్లే స్కూల్ ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ విశాఖ నగర డిప్యూటీ మేయర్ కొఠారి దొరబాబు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ కొయ్య ప్రసాద్ రెడ్డి, రాజకీయ నాయకులు సతీష్ వర్మ , మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు, రవీంద్ర భారతి స్కూల్స్ 5 జిల్లాల జోనల్ ఇంచార్జ్ కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు , శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థల అధినేత వై. వెంకటేశ్వర్లు, శ్రీనివాస స్కూల్ ప్రిన్సిపల్ రాయన శ్రీనివాసరావు, ప్రజ్ఞ ప్లే స్కూల్ అధినేత పిల్లా విజయ్ భాస్కర్ కుమార్, స్థానిక వైకాపా నాయకులు 7వ వార్డ్ అధ్యక్షులు పోతిన శ్రీనివాస్ రావు, మాజీ సింహాచల దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు కృష్ణమూర్తి పాత్రుడు పిల్ల సూరిబాబు ,శ్రీ సూర్య కన్స్ట్రక్షన్స్ వాండ్రాసి అప్పలనాయుడు,పోతిన సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.