ఎంవిపి వాసవి క్లబ్ కపుల్స్ ఆధ్వర్యంలో అన్నదానం,అధ్యక్షుడు రామకృష్ణ వృద్ధులకు అన్నదానం ప్రారంభోత్సవం.
June 06, 2025
.విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :(సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
జై వాసవి... జై జై వాసవి. వాసవీ క్లబ్ ఎం.వి.పి.కపుల్స్ ఆధ్వర్యంలో తేది 06-06-2025 న శుక్రవారం
కీర్తిశేషులు పాలూరి నరసింగరావు భార్య కీర్తిశేషులు కనకమహా లక్ష్మి జ్ఞాపకార్ధం ఏ యు టీ డి ...
జీ వీ ఎం సి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భీంనగర్ షెల్టర్ లో ఉన్న నిరాశ్రయుల పురుషుల వసతి గృహ మందు వృద్ధులకు పాలూరి గంగాధర ప్రసాద్ దంపతులు కుటుంబ సభ్యులు సహకారంతో భోజన సదుపాయం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి అబ్జర్వర్ గా వరిగల వెంకటరమణమూర్తి (పండు) (క్లబ్బుల అభివృద్ధి జిల్లా ఇంచార్జ్) హాజరయ్యారు. ముందుగా వారికి కండువాతో సత్కరించి అన్నదానం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు వాసవియన్లు వెంకట రామకృష్ణారావు, కోశాధికారి చంద్రశేఖర్ గుప్తా, కార్యక్రమాల అధ్యక్షులు పాలూరి శివరామకృష్ణ, ఫాస్ట్ ప్రెసిడెంట్లు మల్లేశ్వర గుప్త, గ్రంధి కృష్ణారావు , పాలూరి నూక రత్నం తదితరులు పాల్గొన్నారు.