విశాఖ సిటీ మధురవాడ, పీఎం పాలెం క్రికెట్ స్టేడియం ఎదురుగా ఉన్న ఎం వివి సిటీ సత్య సాయి సెంటర్ ఆధ్వర్యంలో ధాత్రి ఫౌండేషన్ వారి అమ్మ ఒడి బాలలసంరక్షణ కేంద్రంలో 50 మంది బాల బాలికలకు పుస్తకాల వితరణ. పెన్నులు, పెన్సిల్లు, చాక్లెట్లు బిస్కెట్లు ఇతర సామాగ్రి పంపిణీ చేశారు.

ఓం శ్రీసాయిరాం విశాఖ సిటీ, ఎం వివి సిటీ : ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)(9502817542) భగవాన్ శ్రీసత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామివారి (💯 వ) శతజయంతోత్సవ ఉత్సవములలో భాగంగా ఎంవీవీ సిటీ శ్రీ సత్య సాయి సెంటర్ తలపెట్టిన సేవ కార్యక్రమంలలో భాగంగా 💯 మంది నిరుపేద విద్యార్థులకు నోట్ బుక్స్5 మరియు ఒక పెన్ను ,రెండు పెన్సిల్స్, ఎరేజర్ , స్కేల్, షార్పనర్, బిస్కెట్లు, చాక్లెట్లు ,పళ్లీ చెక్కి, స్వామివారి పాకెట్ క్యాలెండర్, విభూది ఒక కిట్ గా చేసి తేదీ 22.07.2025 మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు D-మార్ట్ వెనుక ఉన్న **ధాత్రి ఫౌండేషన్ వారి అమ్మఒడి* *బాలల సంరక్షణ కేంద్రంలో* అనాధ ఆశ్రమం లో ఉన్న సుమారు 50 మంది పేద విద్యార్థులకు పుస్తకముల మరియు ఇతర సామాగ్రి పంపిణీ జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో సాయి సెంటర్ నిర్వాహకులు టంకాల జ్యోతి శివాజీ , నాగ వేణి వెంకట రామకృష్ణరావు , వేదం గురువుగారు రామి నాయుడు , పీఎం పాలెం సమితి కన్వీనర్ ప్రభాకర్ గారు, సేవాదళ్ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు.