ఎంవిపి వాసవి క్లబ్ కపుల్స్ ఆధ్వర్యంలో తొలి ఏకాదశి పురస్కరించుకొని వృద్ధులకు అల్పాహారం.

విశాఖ సిటీ,ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ) వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో ఆషాడ మాస తొలి ఏకాదశిని పురస్కరించుకొని ఆదివారం,ఉదయం పెద్ద వాల్తేరు,దలై వారి వీధిలో రెడ్ క్రాస్ సొసైటీ లో ఉన్న నిరాశ్రుయులైన వయోవృద్ధులకు వాసవియన్ జల్లూరి సోమేశ్వర గుప్తా ఆర్థిక సహాయంతో అల్పాహారం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో వాసవియన్స్ క్లబ్ అధ్యక్షులు వెంకట రామకృష్ణారావు, కోశాధికారి చంద్రశేఖర్ గుప్తా, ప్రోగ్రాం కోఆర్డినేటర్ శివరామకృష్ణ, చార్టర్ ప్రెసిడెంట్ చెరుకు కృష్ణ, లక్ష్మి పాల్గొన్నారు.