కాపుగంటి వర్ధంతి సందర్భంగా 75 మంది నిరాశ్రయులైన వయోవృద్ధులకు వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో అన్నదానం..
August 21, 2025
విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
జై వాసవి. జై జై వాసవి. వాసవి క్లబ్ ఎం.వి.పి.కపుల్స్ ఆధ్వర్యంలో బుధవారం... తేది... 19-08-2025 న సాయంత్రం 7 గంటల30 నిమిషములకు
కీర్తిశేషులు కాపుగంటి మంగమ్మ గారి 2 వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు, కోడళ్ళు ఆర్థిక సహాయంతో జీ వి ఎం సి పరిధిలోగల భీమ్ నగర్ ఏ.యూ.టి.డి. షెల్టర్ లో వున్న 75 మంది నిరాశ్రుయులైన వయోవృద్ధులకు భోజన సదుపాయం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో వాసవియన్స్ క్లబ్ అధ్యక్షులు వెంకట రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి వెంకటరమణమూర్తి, చార్టర్ ప్రెసిడెంట్ చెరుకు కృష్ణ, మరియు క్లబ్బు సభ్యులు కె. ఎం. గుప్తా, కె.ఫణి కృష్ణవేణి మొదలైన వారు పాల్గొన్నారు..