విశాఖ జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టు లసమస్యలపై గళం వినిపించిన ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్

*కలెక్టరేట్ ఎదుట కదంతొక్కిన జర్నలిస్టులు* ప్రజా బలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ) *ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ల ఫెడరేషన్ డిమాండ్స్ డేకు అనూహ్య స్పందన * *14 డిమాండ్స్ తో కలెక్టర్ కు వినతిపత్రం సమర్పణ* ..విశాఖపట్నం ఆగస్టు 4 ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు విశాఖపట్నం జిల్లా ఫెడరేషన్ యూనిట్, ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్,ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్లు సోమవారం కలెక్టరేట్ ఎదుట డిమాండ్ల సాధనకై నినాదాలు చేస్తూ కదం తొక్కారు. 14 డిమాండ్లపై జర్నలిస్టులు నినాదాలు చేశారు,, శాంతి యుత నిరసన ప్రదర్శన అనంతరం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఈనెల ఆరవ తేదీన జరుగనున్న మంత్రివర్గ సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తీర్మానాలు చేసి ప్రభుత్వం ఆమోదించాలని కోరారు.ప్రధానంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు,అక్రిడేషన్లు,బీమా సదుపాయం,పింఛన్లు జారీ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ సమస్యలు గుర్తించి జర్నలిస్టు ల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని అలా కాని పక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని అన్నారు..ఇప్పటికే రాష్ట్ర మంత్రులకు జర్నలిస్టుల సమస్యలను విశాఖపట్నంలో వివరించామని శ్రీనుబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖపట్నం జిల్లా యూనిట్ అధ్యక్షులు పోతుమహంతి నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఏసీ. బస్సుల్లో ప్రయాణించే సదుపాయం కల్పించాలని,ప్రమాద బీమా పథకం అమలు చేయాలని, సమాచార శాఖ అన్ని విధాలా జర్నలిస్టులకు సహకరించాలని కోరారు. జిల్లా కలెక్టర్ కు సమర్పించిన వినతి పత్రంలో ప్రధానంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, పింఛన్ సదుపాయం కల్పించాలని, రైల్వే పాసులు జారీ చేయాలని,జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని, అక్క్రిడేషన్ కమిటీల్లో జర్నలిస్టుల సంఘాలకు ప్రాతి నిధ్యం కల్పించాలని,జర్నలిస్టుల కోసం వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే ఎఫ్ జిల్లా కార్యదర్శి జి. శ్రీనివాస్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఏ. సాంబశివరావు,ఆర్గనైజింగ్ సెక్రెటరీ పిఎస్ ప్రసాద్, ఉపాధ్యక్షులు బండారు శివప్రసాద్ ఎన్ రామకృష్ణ వై.రామకృష్ణ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షులు ఈరోతి ఈశ్వరరావు, కార్యదర్శి మదన్, త్రినాథ్, నాయుడు, ఫెడరేషన్ సంయుక్త కార్యదర్శి నగేష్ బాబు,ఆనంద్,స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీ ఎస్ జగన్మోహన్,కోశాధికారి కేవీ శర్మ,సంయుక్త కార్యదర్శి బీ ప్రసాద్,కార్యనిర్వాహక సభ్యులు అరుణ్ భాస్కర్ (హరి),వీ గణేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.