చిన్న శ్రీను ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ ప్రారంభించిన చిన్న శ్రీను సోల్జర్ అధ్యక్షురాలు సిరమ్మ.. తన తండ్రి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, భీమిలి వైసిపి ఇన్చార్జి చిన్న శ్రీను జన్మదిన వేడుకలు పురస్కరించుకొని క్రికెట్ టోర్నమెంట్.
August 29, 2025
చిన్న శ్రీను ప్రీమియర్ లీగ్ చిన్న శ్రీను ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ లో సిరమ్మ.
(భీమిలి నియోజకవర్గం, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
అంగ రంగ వైభవంగా ప్రారంభం అయిన చిన్న శ్రీను పుట్టిన రోజు సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ వేడుకలు.
తే 29.08.2025ది,
భీమిలి.
భీమిలి ఫుడ్ బాల్ గ్రౌండ్ లో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్.ఆర్.సీ. పి. జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) పుట్టిన రోజు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.తన కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ తే 29.08.2025ది నుండి తే 04.09.2025ది వరకూ జరుగు చిన్న శ్రీను ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ ను స్వయంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ పుట్టిన రోజు వేడుకలు ఈ రోజు నుండే శుక్రవారం ప్రారంభం అయ్యాయి.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు
1) మొదటి స్థానం బహుమతి : Rs.50000/-
2) రెండవ స్థానం : Rs.30000/-
3) మూడవ స్థానం బహుమతి : Rs.15000/-
బహుమతి ప్రదానం చేస్తామని చెప్పారు. అదేవిధంగా క్రీడా కారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇటువంటి టోర్నమెంట్లు ఉపయోగ పడతాయన్నారు. జీవితంలో ఉన్నత స్థాయి చేరడానికిb క్రీడలు ఎంతో అవసరమన్నారు. క్రీడలు వల్ల దేహధారుడ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి కూడా ఉపయోగ పడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, వార్డు కార్పొరేటర్లు, వార్డు ఇంచార్జిలు, వార్డు పార్టీ ప్రెసిడెంట్స్, సోషల్ మీడియాసభ్యులు, నాయకులు, కార్య కర్తలు, స్థానిక ప్రజలు, క్రీడా కారులు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


