కీర్తిశేషులు వత్తి పల్లి కోటేశ్వరరావు వర్ధంతి సందర్భంగా అతని సతీమణి రాధిక ఆర్థిక సహాయంతోఅల్లిపురం ఏయూటీ డి నిర్వహణలో నడుస్తున్న నిరాశ్రయుల వసతి గృహం నందు వయోవృద్ధులకు,. వాసవి క్లబ్ కపుల్స్ ఎంవిపి ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు.

విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో తేదీ 12.01.2026 సోమవారం ఉదయం 7 గంటల 30 నిమిషాలకు అల్లిపురం, జీవీఎంసీ ఏయూటిడి నిర్వహణలో నడుస్తున్న నిరాశ్రయుల వసతి గృహమందు స్వర్గీయ శ్రీ వత్తిపల్లి కోటేశ్వరరావు గారి వర్ధంతిసందర్భంగా వారి ధర్మపత్ని రాధిక ఆర్థిక సహకారంతో అల్పాహారం ఏర్పాటు చేయడమైనది . ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, క్యాబినెట్ కోశాధికారి వాసవియన్ చెరుకు కృష్ణ పూర్వపు అధ్యక్షులు వాసవియన్ గ్రంధి కృష్ణారావు గారు పాల్గొన్నారు.